3 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. ఎందుకంటే?

by Dishanational6 |
3 భారతీయ కంపెనీలపై అమెరికా నిషేధం.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్‌తో అక్రమంగా వ్యాపారం చేసిన డజనకుపైగా కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇరాన్‌కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు, వ్యక్తులు, షిప్ లపైన యూఎస్ ఆంక్షలు విధించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్‌ మానవరహిత వైమానిక వాహనాలను అందజేశారని అమెరికా తెలిపింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో 12కు పైగా కంపెనీలపై నిషేదం విధించగా వాటిలో భారత్ కు చెందిన 3 కంపెనీలు ఉన్నాయి.

ఇక, రష్యాకు అక్రమంగా ఆయుధాలను చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం ‘సహారా థండర్’ కీలక పాత్ర పోషించినట్లు అమెకా తెలిపింది. కాగా, హిజ్బుల్లా, హమాస్, పాలస్థీనా ఇస్లామిక్ జిహాద్ లాంటి ఉగ్రవాద గ్రూపులకు సపోర్టు ఇస్తున్నందుకు ఇరాన్‌పై అమెరికా పీకలదాకా కోపంగా ఉంది. ఉక్రెయిన్‌తో యుద్ధం చేసేందుకు రష్యాకు రహస్య విక్రయాలను సులభతరం చేశాయని ఈ కంపెనీలపై ఆరోపణలు చేసింది అమెరికా. ఆర్థిక సాయం అందించడంలో కంపెనీలు, వ్యక్తులు ప్రధాన పాత్ర పోషించాయని అగ్రరాజ్య ట్రెజరీ విభాకం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది.

ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాల నుంచి రష్యా ఆయుధాలను సమకూర్చుకుంటుందని యూఎస్ ఆరోపించింది. ఇక, భారత్‌కు చెందిన కంపెనీల్లో జెన్ షిప్పింగ్, పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, సీఆర్ట్ షిప్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. కాగా, ఇరాన్‌కు చెందిన సహారా థండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాలకు చెందిన ఆయుధాలను విక్రయించిందని ఆరోపించింది. చైనా, రష్యా, వెనిజులా సహా పలు ఇతర దేశాలకు అమ్మకాలు జరిపేందుకు షిప్పింగ్ నెట్‌వర్క్‌పై ఆధారపడిందనే విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం స్పష్టం చేసింది.



Next Story

Most Viewed