6 నుంచి పూరీ జగన్నాథుడి రథయాత్ర.. 315 ప్రత్యేక రైళ్లు

by Hajipasha |
6 నుంచి పూరీ జగన్నాథుడి రథయాత్ర.. 315 ప్రత్యేక రైళ్లు
X

దిశ, నేషనల్ బ్యూరో : ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాలు జులై 6న ప్రారంభం అవుతాయి. అవి జులై 19 వరకు కొనసాగుతాయి. ఈ యాత్రకు హాజరయ్యేందుకు భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ 315 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఒడిశాలోని బాదం పహాడ్‌, రూర్కెలా, బాలేశ్వర్‌, సోనేపుర్‌, దస్‌పల్లా, జునాగఢ్‌ రోడ్‌, సంబల్‌పుర్‌, కేందుజుహర్‌గఢ్‌, పారాదీప్‌, భద్రక్‌, అనుగుల్; గుణుపుర్‌ నుంచి ప్రత్యేక రైళ్లు ప్రారంభమవుతాయని ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే వెల్లడించింది. ఒడిశాలోని అన్ని ప్రధాన పట్టణాల మీదుగా రైళ్లు నడిచేలా అధికారులు రూట్‌ మ్యాప్‌‌ను రెడీ చేశారు. దక్షిణ మధ్య రైల్వే కూడా కొన్ని ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉంది.

Next Story

Most Viewed