'సోనియా జీ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?'.. అడిగి తెలుసుకున్న ప్రధాని

by Vinod kumar |
సోనియా జీ.. మీ ఆరోగ్యం ఎలా ఉంది?.. అడిగి తెలుసుకున్న ప్రధాని
X

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని పార్లమెంటులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె కూర్చున్న చోటుకు వెళ్లి.. ఆరోగ్యం, క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు సోనియాగాంధీ బదులిస్తూ.. తన ఆరోగ్యం బాగుందని చెప్పారు. గురువారం ఉదయం పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలి రోజు స‌భ ప్రారంభం కావడానికి ముందు.. ప్రధాని మోడీ విప‌క్ష నేత‌ల్ని క‌లిశారు. ఇలా అందరికీ గ్రీటింగ్ చేస్తున్న క్రమంలో సోనియా గాంధీతోనూ ఆయన మాట్లాడారు. విప‌క్ష నేత‌ల బెంచ్ వ‌ద్దకు చేరుకున్న స‌మ‌యంలో ఆయ‌న సోనియాను పలకరించారు.

జులై 18న సాయంత్రం బెంగళూరులో విపక్ష కూటమి భేటీని ముగించుకుని ఢిల్లీకి తిరిగి వస్తుండగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల భోపాల్‌లో అత్యవసరంగా ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. దీనిపైనే ప్రధాని మోడీ.. సోనియాను ఆరా తీశారు. అయితే ప్రధాని మోడీ పలకరించిన సమయంలోనే మణిపూర్‌ అంశంపై పార్లమెంట్‌లో చర్చించాలని సోనియా గాంధీ డిమాండ్ చేశారని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed