- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Manipur: మిలిటెంట్ గ్రూపుల నుంచి వార్నింగ్స్.. మణిపూర్ సర్కారు కీలక నిర్ణయం..
ఇంఫాల్ : మణిపూర్లోని మైతై వర్గానికి చెందిన వేలాదిమంది శరణార్థులు మిజోరాంలోని సరిహద్దు ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అయితే వారికి అక్కడ కూడా భద్రత లభించే పరిస్థితి కనిపించడం లేదు. కుకీ తెగకు చెందిన ఇద్దరు మహిళలను మైతై వర్గానికి చెందిన పలువురు మూకలు నగ్నంగా ఊరేగించిన ఘటన గురించి తెలిసినప్పటి నుంచి మిజోరాంలో ఆశ్రయం పొందుతున్న మైతైలకు వార్నింగ్స్ రావడం మొదలైంది. భద్రంగా ఉండాలంటే మిజోరాంను విడిచి వెళ్లిపోండి అంటూ "పీస్ అకార్డ్ మిజో నేషనల్ ఫ్రంట్ రిటర్నీస్ అసోసియేషన్" (పామ్రా) అనే సంస్థ మైతైలను హెచ్చరించింది. పామ్రా సంస్థ ఒకప్పుడు మిజో నేషనల్ ఫ్రంట్లో మిలిటెంట్ విభాగంగా ఉండేది.
అయితే దీనిపై స్పందించిన మిజోరాం ప్రభుత్వం.. పూర్తి భద్రత కల్పిస్తామని మైతై శరణార్ధులకు భరోసా ఇచ్చింది. భయపడాల్సిన అవసరం లేదని చెప్పింది. అయినా 65 మంది మైతై శరణార్ధులు శనివారం ఐజ్వాల్ నుంచి విమానంలో మణిపూర్కు వెళ్లిపోయారు. సోమవారం కూడా ఇంకొంత మంది వెళ్లిపోనున్నారు. ఈ నేపథ్యంలో మిజోరాంలో ఉన్న మైతై శరణార్ధులను ప్రత్యేక ట్రాన్స్ పోర్ట్ విమానాల్లో సొంత రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మణిపూర్ రాష్ట్ర సర్కారు రెడీ అవుతోంది.