- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Parliament Session: రైతులను పార్లమెంటులోకి రానివ్వలేదు- రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పార్లమెంట్ కాంప్లెక్స్లో రైతులతో సమావేశం అయ్యారు. పార్లమెంట్లోని రాహుల్ గాంధీ ఛాంబర్లో ఈ భేటీ కొనసాగుతోంది. అయితే ఈ భేటీ ఇప్పటికే చర్చనీయాంశమైంది. తనను కలిసేందుకు వచ్చిన రైతులను పార్లమెంటులోకి అనుమతివ్వలేదని ఆరోపించారు. వారిని తన కార్యాలయానికి తానే ఆహ్వానించినట్లు వెల్లడించారు. రైతులు కావడం వల్లే వారిని వారిని లోనికి అనుమతించలేదన్నారు. అయితే ఈ విషయం మీడియా ముందుకు రావడంతో రాహుల్ను కలిసేందుకు రైతులను అనుమతించారు.
రైతులతో రాహుల్ భేటీ
ఇకపోతే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో 12 మంది సభ్యులతో కూడిన రైతు ప్రతినిధుల బృందం పార్లమెంటు భవనంలో భేటీ అయ్యింది. ఈ బృందంలో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలు ఉన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎంపీలు రాజా బరార్, సుఖ్జీందర్ సింగ్ రంధావా, గుర్జీత్ సింగ్ ఔజ్లా, ధరమ్వీర్ గాంధీ, దీపేందర్ సింగ్ హుడా, జై ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.