Kerala: కేరళలో యూట్యూబర్ జంట మృతి

by Shamantha N |
Kerala: కేరళలో యూట్యూబర్ జంట మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని పరస్సాలలో యూట్యూబర్ జంట అనుమానాస్పస్థితిలో మృతి చెందారు. వారి నివాసంలో విగతజీవులుగా కన్పించారు. ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెల్వరాజ్ (45) ఉరి వేసుకుని మృతి చెందగా, అతని భార్య 40 ఏళ్ల ప్రియ మృతదేహం బెడ్‌పై కనిపించింది. ప్రాథమిక విచారణ ప్రకారం రెండు రోజుల క్రితమే మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా.. వారిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సెల్లు ఫ్యామిలీ యూట్యూబ్ ఛానెల్

సెల్వరాజ్ (45), అతని భార్య ప్రియ (40) అనే దంపతులు ‘సెల్లు ఫ్యామిలీ’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు. వారి ఛానెల్‌కు దాదాపు 18వేల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. దాదాపు 1,400 కంటే ఎక్కువ వీడియోలను పోస్ట్ చేసారు. కాగా.. ఈ జంట శుక్రవారం రాత్రి చివరి వీడియోని పోస్టు చేసింది.

Advertisement

Next Story