- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
MLA Battula Lakshmareddy : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
by Naveena |
X
దిశ, మిర్యాలగూడ : విద్యార్థి దశ నుంచి చదువుతో పాటు క్రీడల్లో రాణించి మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి( MLA Battula Lakshmareddy )అన్నారు. ఆదివారం మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ ఎంజిపిటి బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పిల్లలకు చదువుతో పాటు క్రీడలు నిర్వహించడంతో..శారీరక నైపుణ్యంతో పాటు మానసిక నైపుణ్యం కూడా పెరుగుతుందన్నారు. బాలికలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.మహిళలు అన్నిరంగాల్లో ముందుండాలని వారు సంకల్పిస్తే ఏదైనా సాధించగలరన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Advertisement
Next Story