- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
కశ్మీర్లో ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
by Vinod kumar |
X
కుప్వారా: జమ్మూ కశ్మీర్ లోని కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచల్సెక్టార్లో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో నియంత్రణ రేఖ మార్గం మీదుగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.
ఈ ఫైరింగ్ లో టెర్రరిస్టులు అందరూ హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, ఈనెల 16న కుప్వారాలోని జుమాగుండ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లోనూ ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.
Advertisement
Next Story