కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం

by Vinod kumar |
కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం
X

కుప్వారా: జమ్మూ కశ్మీర్ లోని కుప్వారాలో జరిగిన ఎన్ కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచల్​సెక్టార్‌లో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు శుక్రవారం జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈక్రమంలో నియంత్రణ రేఖ మార్గం మీదుగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులపై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

ఈ ఫైరింగ్ లో టెర్రరిస్టులు అందరూ హతమయ్యారని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాగా, ఈనెల 16న కుప్వారాలోని జుమాగుండ్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లోనూ ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

Advertisement

Next Story

Most Viewed