- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Reliance Jio: కస్టమర్లకు రిలయన్స్ జియో దీపావళి ఆఫర్స్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై రూ.3,350 విలువైన బెనిఫిట్స్..!
దిశ, వెబ్డెస్క్: దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో(Reliance Jio) తన వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి ఫెస్టివల్(Diwali Festival) సందర్భంగా 'దీపావళి ధమాకా(Diwali Dhamaka)' పేరుతో కొత్త ఆఫర్లను ప్రకటించింది. సెలెక్ట్ చేసిన ప్లాన్(Recharge plan)లపై రూ.3,350 విలువైన బెనిఫిట్లు ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని పేర్కొంది. అయితే నవంబర్ 3వ తేది లోపు రీఛార్జ్ చేసే కస్టమర్లకు మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుందని తెలిపింది. అయితే ఈ ఆఫర్ లో భాగంగా రూ.899, రూ.3,599 రీఛార్జి ప్లాన్లపై జియో ఎక్సట్రా బెనిఫిట్స్ అందిస్తోంది. నవంబర్ 3 లోపు కస్టమర్లు ఈ ప్లాన్లతో రీఛార్జి వేసుకుంటే రూ.3000 విలువైన 'ఈజ్ మై ట్రిప్(EaseMyTrip)' వోచర్ పొందవచ్చు. హోటల్స్ లో రూమ్స్ బుక్ చేసుకునే వారు, ఫ్లైట్ జర్నీ చేసే వారు ఈ వోచర్(Voucher)ను వాడుకోవచ్చు. అలాగే కస్టమర్లు అజియో(Ajio)లో రూ. 999 కంటే ఎక్కువ షాపింగ్ చేసినప్పుడు రూ. 200 విలువైన కూపన్, మరోవైపు రూ.150 విలువైన స్విగ్గీ వోచర్(Swiggy Voucher) కూడా పొందొచ్చు. రీఛార్జ్ చేసిన తర్వాత 'మై జియో(My Jio)' యాప్ సాయంతో యూజర్లు ఈ కూపన్ రీడిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా రూ.899 ప్లాన్ రీఛార్జితో రోజుకు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్లు పొందొచ్చు. దీంతోపాటు 20జీబీ డేటా అదనం. 90 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రూ.3,599 ప్లాన్తో అన్ లిమిటెడ్ కాల్స్, డైలీ 100 ఎస్సెమ్మెస్లు, 2.5జీబీ డేటాను పొందొచ్చు. ఈ ప్యాక్ వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది.