Bandi Sanjay : కేటీఆర్ కు లీగల్ నోటీసులు తప్పవు : బండి సంజయ్ వార్నింగ్

by M.Rajitha |   ( Updated:2024-10-25 12:33:04.0  )
Bandi Sanjay : కేటీఆర్ కు లీగల్ నోటీసులు తప్పవు : బండి సంజయ్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్ : హద్దులు మీరి విమర్శలు చేసినందుకు బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) కు నోటీసులు పంపిస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay). రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయని.. అవి హుందాగా ఉండాలి గాని, హద్దు దాటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కేటీఆర్ ను హెచ్చరించారు. బీఆర్ఎస్(BRS) పదేళ్ళలో ప్రజలకు చేసింది ఏమీ లేదని, ప్రజలకు దూరంగా ఉండి.. ప్రశ్నించిన వాళ్ళను జైల్లో వేసిన వైఖరి నచ్చకే ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. ఎవరి భాష ఏంటో.. ఎవరి సంస్కారం ఏంటో ప్రజలకు బాగా తెలుసని, అందుకే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని అన్నారు. మీలాగా ఏది పడితే అది మాట్లాడలేమని, మాకు సంస్కారం అడ్డు వస్తుందని బండి ఎద్దేవా చేశారు. హద్దులుమీరి బీజేపీపై అసత్య ప్రచారం చేస్తున్నందుకు కేటీఆర్ కు లీగల్ నోటీసులు పంపిస్తానని తెలియ జేశారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం లేదని ప్రమాణం చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. దీపావళిలోపు బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారంటూ కాంగ్రెస్ లీకులు ఇస్తోందన్నారు. ఏదైనా అవినీతికి పాల్పడితే వెంటనే అరెస్ట్ చేయాలి గాని, ముందుగా జాగ్రత్త పడి ఆధారాలు చెరిపేసేలా ఇది చేస్తాం అది చేస్తాం అని కాంగ్రెస్ ప్రకటనలు చేయడం.. ఆ రెండు పార్టీలు తోడు దొంగలు అని అర్థం అవుతోందన్నారు.

Advertisement

Next Story

Most Viewed