IND vs NZ 2nd Test : రెండో రోజు ముగిసిన ఆట...భారీ ఆధిక్యం దిశగా కివీస్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-25 12:11:26.0  )
IND vs NZ 2nd Test : రెండో రోజు ముగిసిన ఆట...భారీ ఆధిక్యం దిశగా కివీస్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ - న్యూజిలాండ్ (India - New Zealand) మధ్య పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (Second Test) లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసేసరికి తొలి ఇన్నింగ్స్ అధిక్యతతో కలిపి న్యూజిలాండ్ 301 పరుగుల భారీ ఆధిక్యం(Huge lead)లో కొనసాగుతోంది. ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్​లో న్యూజిలాండ్ 195/5 స్కోర్ వద్ద ఉంది. క్రీజులో గ్లెన్ ఫిలిప్ (9 పరుగులు), టామ్ బ్లండెల్ (30 పరుగులు)తో ఉన్నారు. కివీస్ రెండో ఇన్నింగ్స్ లో వాషింగ్టన్ సుందర్ 4, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్​లో16/1 స్కోరుతో శుక్రవారం ఆట ప్రారంభించింది. 156 పరుగులకే ఆలౌటైంది. భారత్ టాప్ ఆర్డర్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు. భారత జట్టు 140 పరుగులలోపు చివరి 9 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా అత్యధికంగా 38 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ చెరొక 30పరుగులు చేశారు. వాషింగ్టన్ సుందర్ 18 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 103 పరుగుల వెనుకంజలో ఉంది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 7 వికెట్లతో సత్తా చాటగా, గ్లెన్ ఫిలిప్ 2, టిమ్ సౌథీ 1 వికెట్ సాధించారు. కివీస్ తొలి ఇన్నింగ్స్​లో 259 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed