Gorakhpur MP : తిరుమల లడ్డూ వివాదంపై ఎంపీ, రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh N |
Gorakhpur MP : తిరుమల లడ్డూ వివాదంపై ఎంపీ, రేసు గుర్రం విలన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయి నేతలు ఈ వివాదంపై స్పందిస్తున్నారు. శ్రీవారి లడ్డూ కల్తీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గోరఖ్ పూర్ ఎంపీ, రేసు గుర్రం సినిమా విలన్, నటుడు రవి కిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులు పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఎంపీ రవికిషన్ ప్రసంగించారు. శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని స్పీచ్ ఇచ్చారు.

బాలాజీ మందిర్‌లో హిందువులకు ఆవు కొవ్వుతో తయారైన లడ్డూలు ఇచ్చారని, అసలు హిందువులపై ఏమి జరుగుందని మండిపడ్డారు. ఇది ఆలోచించాల్సిన విషయమని, ఆ నాడు టీటీడీ ఆలయాన్ని నడిపినవారు హిందువులు కాదని ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రాలతో పాటు అస్త్రాలను వెంట తీసుకెళ్లాల్సిన సమయం వచ్చిందని, సాధువులు యోధులుగా మారాల్సిన పరిస్థితులు వచ్చాయని ఫైర్ అయ్యారు. కాగా, తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తున్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పై ఘాటు ఆరోపణలు చేశారు.

Next Story

Most Viewed