జమ్ముకశ్మీర్ లో భారీ పేలుడు, నలుగురు మృతి

by Shamantha N |
జమ్ముకశ్మీర్ లో భారీ పేలుడు, నలుగురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో సోమవారం పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. బరాముల్లా జిల్లాలోని సోపోర్ రీజియన్ షేర్ కాలనీలో ప్రమాదం జరిగింది. అయితే, పేలుడుకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. పేలుడు జరిగినట్లు ఉన్నతాధికారులు సైతం ధ్రువీకరించారు. ప్రస్తుతం పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియరాలేదని.. కారణాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపారు. అయితే, పేలుడు జరగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దంతో పేలుడు జరిగే సరికి ఏం జరుగుతుందోనని టెన్షన్ పడినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed