ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. లోపల 177 మంది..

by Harish |
ఢిల్లీ-శ్రీనగర్ విస్తారా విమానానికి బాంబు బెదిరింపు.. లోపల 177 మంది..
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ-శ్రీనగర్ మధ్య ప్రయాణించే విస్తారా విమానానికి(UK-611) బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం నాడు 177 మంది ప్రయాణికులు, ఒక శిశువుతో ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు బయలుదేరిన విస్తారా విమానం గాల్లో ఉండగానే లోపల బాంబు ఉన్నట్లు శ్రీనగర్‌లోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ సిబ్బంది, భద్రత బలగాలు అప్రమత్తమయ్యాయి. విమానం 12:10 AM సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

విమానం ల్యాండ్ అయిన వెంటనే ఐసోలేషన్ బేకు తరలించి, ప్రయాణికులను దింపి, క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అంతరాయం ఉన్నప్పటికీ, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. వారి భద్రతను నిర్ధారించడానికి పరిస్థితిని అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని, మరింత సమాచారం అందుబాటులోకి వచ్చినప్పుడు పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ ఎవరు చేశారు, అది ఎక్కడి నుంచి వచ్చింది మొదలగు డేటాను అధికారులు కనిపెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed