మధ్యప్రదేశ్‌లో 'పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్'ను ప్రారంభించిన అమిత్ షా

by S Gopi |
మధ్యప్రదేశ్‌లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యప్రదేశ్‌లోని మొత్తం 55 జిల్లాల్లో 'ప్రధానమంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్'ని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో కొత్త విద్యా విధానాన్ని తీసుకురావడంలో నరేంద్ర మోడీ దూరదృష్టిని ప్రశంసించారు. ఆదివారం ఇండోర్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్‌లో పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్‌ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ.. విద్యార్థులు తప్పనిసరిగా కొత్త విద్యా విధానం(ఎన్ఈపీ) డాక్యుమెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. వందేళ్ల స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఎన్ఈపీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్ఈపీ విద్యార్థులను వారి సంస్కృతిని దూరం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా ఉంటుంది. ఇది నాణ్యతపై దృష్టి పెడుతుందని అమిత్ షా అన్నారు. బట్టీ పట్టడం వల్ల విద్యార్థుల స్కోరు పెరిగినప్పటికీ నైపుణ్యం మెరుగవదు. ఎన్ఈపీ కింద ఏర్పాటైన పీఎం ఎక్స్‌లెన్స్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story