Bihar: దైవదర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు.. విద్యుత్ వైర్లు తగిలి 8 మంది మృతి

by Shamantha N |
Bihar: దైవదర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు.. విద్యుత్ వైర్లు తగిలి 8 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ లోని హాజీపూర్ జిల్లా సుల్తాన్ పూర్ లో ఘోరప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతో 8 మంది భక్తులు దుర్మరణం చెందారు. హరిహరనాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు మినీ ట్రక్కుపై భక్తుల బృందం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. వారు ఆలయానికి వాహనంలో వెళ్తుండగా.. 11కేవీ హై టెన్షన్ వైరు తాకింది. దీంతో కరెంట్ షాక్ వల్ల ఎనిమిది మంది చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. శ్రావణ మాసంలో స్థానిక యువకులు హరిహరనాథ్ ఆళయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఆ కార్యక్రమం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)తో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్పాట్ లో సహాయక చర్యలుచేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానికులు మండిపడుతున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తున్నారు. పదేపదే కాల్స్ చేసినప్పటికీ వారు ఫోన్ కు సమాధానం ఇవ్వలేదన్నారు. తక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story