లావణ్య త్రిపాఠికి ఏమైంది?.. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి అందుకే రాలేకపోయిందా?

by Javid Pasha |
లావణ్య త్రిపాఠికి ఏమైంది?.. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి అందుకే రాలేకపోయిందా?
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందడం, మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఒక పండుగ వాతావరణంలా జరిగింది. మెగా ఫ్యామిలీతోపాటు పవన్ అభిమానులంతా వేడుకను ఫుల్ ఎంజాయ్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌లో నరేంద్రమోడీ, అమిత్‌షా, చంద్రబాబు, బాలకృష్ణ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇక పవన్ కుటుంబంతోపాటు వేదికపై మెగా ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. కానీ అక్కడ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు కనబడకపోవడంపై ప్రజెంట్ మెగా ఫ్యాన్స్‌లో డిస్కషన్ నడుస్తోంది.

ఇంతకీ లావణ్య త్రిపాఠికి ఏమైంది?, ప్రమాణ స్వీకారానికి ఎందుకు రాలేకపోయింది? మెగా ఫ్యామిలీలో ఏమైనా జరిగిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పవన్ గెలిచాక లావణ్య - వరుణ్ తేజ్ దంపతులు ఆయనకు కంగ్రాట్స్ కూడా చెప్పారు. అంతేకాకుండా పవన్‌కు వెల్కం చెప్పే సమయంలో చిరంజీవి ఇంటిలో మొత్తం మెగా ఫ్యామిలీతోపాటు వీరు కూడా ఉన్నారు. కాకపోతే ప్రమాణ స్వీకారం రోజు వేదిక వద్దకు మాత్రం రాలేదు.

మెగా కోడలు రాకపోవడానికి కారణం ఏమిటో ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. చివరికి తెలిసిందే ఏంటంటే.. ఇటీవల ఓ చిన్న ప్రమాదంలో ఆమె కాళ్లకు గాయమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫొటో కూడా షేర్ చేసింది లావణ్య. కాగా పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ రోజు బాగానే ఉన్న మెగా కోడలు, ప్రమాణ స్వీకారం రోజు కాస్త నొప్పి ఎక్కువగా ఉండటంతో అక్కడికి రాలేకపోయిందట. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story