ఈ ఏడాది వేణుస్వామి చెప్పిన రెండు షాకింగ్ నిజాలివే!

by Anjali |   ( Updated:2023-06-04 14:42:52.0  )
ఈ ఏడాది వేణుస్వామి చెప్పిన రెండు షాకింగ్ నిజాలివే!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. గతంలో ఆయన సమంత - నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు.. రాంచరణ్-ఉపాసనలు ఆలస్యంగా తల్లిదండ్రులు అవుతారని చెప్పినవన్నీ నిజమయ్యాయి. దీంతో వేణు ఏం చెప్పినా అక్షర సత్యమని చాలామంది ఫిక్స్ అయిపోయారు. ఇటీవల.. ‘2023లో ప్రభాస్ జాతకం చాలా వరస్ట్‌గా ఉందని’ ఇతను చెప్పడంతో, రెబల్ స్టార్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. వేణు స్వామి చెప్పిన మరో రెండు విషయాలు కూడా నిజమయ్యాయి. ఈ ఏడాది ఓ యంగ్ హీరో చనిపోతాడు అని ఇతను చెప్పాడట.

తారకరత్న మరణంతో అది కాస్త వాస్తవమయ్యింది. అలాగే ఓ టాలీవుడ్ హీరో, హీరోయిన్ వివాహం చేసుకుంటారని చెప్పాడు. తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం వేడుక గురించి బయట పడనే పడింది. కొంతమంది ఇవి అపోహాలు అనగా, మరికొంతమంది వేణు స్వామి చెప్పేవన్నీ నిజాలేననీ కామెంట్లు పెడుతున్నారు. కేవలం ఇండస్ట్రీకి చెందిన వారి గురించే కాకుండా రాజకీయ నేతల గురించి కూడా వేణుస్వామి చెబుతుంటారు. దీంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

ఇవి కూడా చదవండి:

నిహారిక కోసం లావణ్య త్రిపాఠి ఇంత పెద్ద త్యాగం చేసిందా!

ఆ విషయంలో దేవుడ్ని ఎప్పటికీ నిందిస్తూనే ఉంటా: సింగర్ సునీత

Advertisement

Next Story

Most Viewed