తీవ్ర విషాదంలో ప్రముఖ తెలుగు దర్శకులు..!

by M.Rajitha |
తీవ్ర విషాదంలో ప్రముఖ తెలుగు దర్శకులు..!
X

దిశ వెబ్ డెస్క్ : తెలుగు ప్రముఖ దర్శకులు వంశీ, రాఘవేంద్రరావులు విచారంలో మునిగి పోయారు. దీనికి గల కారణం ఓ చెట్టు అంటే నమ్మగలరా..! కాని నిజం. వీళ్ళే కాదు కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపు లాంటి ఎందరో లెజెండరీ డైరెక్టర్స్ సినిమాల్లో చాలా సన్నివేశాల్లో వాడిన చెట్టు ఇపుడు కూలిపోయింది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలో ఓ చెరువు పక్కన ఉన్న ఈ మహావృక్షం.. మొదట 1975 లో విడుదలయిన పాడిపంటలు సినిమాలో ఈ వృక్షం కనిపిస్తుంది. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలుతో పాటు ఈ మధ్య కాలంలో వచ్చిన రంగస్థలంతో సహ దాదాపు 300 సినిమాల్లో ఈ చెట్టు చుట్టూ షూటింగ్ చేశారు. దర్శకుడు వంశీ అయితే ఈ చెట్టు కిందే చిత్ర యూనిట్, స్నేహితులతో కలిసి భోజనం చేసేవారట. అంతటి పేరున్న ఈ చెట్టు కూలిపోవడం పట్ల ఆయా చిత్రాల దర్శకులే కాదు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఆ ఊరి ప్రజలైతే.. చెట్టు ఉన్నంత కాలం ఏదోక షూటింగ్ జరిగేదని, ఇకపై మా ఊళ్ళో షూటింగులు జరగవని బాధ పడుతున్నారు.

Next Story