సుధీర్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్.. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌‌తో ప్రయోగం..

by Sujitha Rachapalli |
సుధీర్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్.. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్‌‌తో ప్రయోగం..
X

దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా 'హరోం హర ' మూవీతో సక్సెస్ అందుకున్న ఆయన.. మరో యూనిక్ స్టోరీ ఓకే చేశాడు. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ తో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. రుస్తుం, టాయ్‌లెట్‌: ఏక్ ప్రేమ్ క‌థ‌, ప్యాడ్ మ్యాన్‌, ప‌రి వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను అందించిన ప్రేర‌ణ అరోరా స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రం రూపొంద‌నుండగా.. వెంట్ క‌ళ్యాణ్ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్నాడు. త్వ‌ర‌లోనే చిత్ర యూనిట్‌తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది.

కాగా ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా మార్చిలో విడుద‌ల చేయ‌నున్నారు. లోతైన క‌థ‌తో రానున్న ఈ చిత్రంలో కుట్ర, ప‌న్నాగాలు క‌ల‌గ‌లిసిన చెడుకి, మంచికి జ‌రిగే యుద్ధంగా.. ఇండియ‌న్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ కాబోతుందని చెప్తున్నారు మేకర్స్. ఇక ఈ సంద‌ర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ న‌చ్చి ఏడాది పాటు టీమ్‌తో ట్రావెల్ అవుతున్నాను. డిఫ‌రెంట్ కంటెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్ష‌క‌ల ముందుకు ఎప్పుడెప్పుడు వ‌ద్దామా అని చాలా ఆతృత‌గా ఎదురుచూస్తున్నాను. వ‌ర‌ల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి ప్రేర‌ణ అరోరా, ఆమె టీమ్ స‌భ్యులు ఎంత‌గానో క‌ష్ట‌ప‌డుతున్నారు. ఇది ప్రేక్ష‌కుల మ‌న‌సుకు హ‌త్తుకుంటుంద‌నే గ‌ట్టి న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు.

Advertisement

Next Story

Most Viewed