- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
సుధీర్ బాబు పాన్ ఇండియా ప్రాజెక్ట్.. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్తో ప్రయోగం..
దిశ, సినిమా: నవ దళపతి సుధీర్ బాబు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ తో మెప్పిస్తున్నాడు. రీసెంట్ గా 'హరోం హర ' మూవీతో సక్సెస్ అందుకున్న ఆయన.. మరో యూనిక్ స్టోరీ ఓకే చేశాడు. సూపర్ నేచురల్ మిస్టరీ థ్రిల్లర్ తో పాన్ ఇండియా హీరోగా మారబోతున్నాడు. రుస్తుం, టాయ్లెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఈ చిత్రం రూపొందనుండగా.. వెంట్ కళ్యాణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. త్వరలోనే చిత్ర యూనిట్తో బాలీవుడ్ హీరోయిన్ జాయిన్ కానుంది.
కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా మార్చిలో విడుదల చేయనున్నారు. లోతైన కథతో రానున్న ఈ చిత్రంలో కుట్ర, పన్నాగాలు కలగలిసిన చెడుకి, మంచికి జరిగే యుద్ధంగా.. ఇండియన్ సినిమాల్లో ఓ మైల్ స్టోన్ కాబోతుందని చెప్తున్నారు మేకర్స్. ఇక ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమా స్క్రిప్ట్ నచ్చి ఏడాది పాటు టీమ్తో ట్రావెల్ అవుతున్నాను. డిఫరెంట్ కంటెంట్తో రూపొందనున్న ఈ సినిమాతో ప్రేక్షకల ముందుకు ఎప్పుడెప్పుడు వద్దామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను. వరల్డ్ క్లాస్ సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ను ప్రేక్షకులకు అందించటానికి ప్రేరణ అరోరా, ఆమె టీమ్ సభ్యులు ఎంతగానో కష్టపడుతున్నారు. ఇది ప్రేక్షకుల మనసుకు హత్తుకుంటుందనే గట్టి నమ్మకం ఉంది’’ అన్నారు.