- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
భారీ షాక్.. మాజీ ముఖ్యమంత్రి మనవడితో స్టార్ హీరోయిన్ డేటింగ్.. నెట్టింట దుమారం రేపుతోన్న వీడియో
దిశ, సినిమా: హీరోయిన్ మానుషీ చిల్లర్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ 2017 లో మిస్ వరల్డ్ కిరీటం సొంతం చేసుకుని హర్యానాకు 67 వ ప్రపంచ సుందరిగా నిలిచింది. మన ఇండియా తరపున ఈ కిరిటం గెలిచిన 6 వ యువతిగా ఈ బ్యూటీ రికార్డు క్రియేట్ చేయడం విశేషం. అనంతరం పలు కాస్మొటిక్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలిచింది. ఇక 2022 లో సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకోలేదు. అయినా కూడా ఈ మానుషీ చిల్లర్కు అవకాశాలు క్యూ కడుతూనే ఉన్నాయి. బడేమియా చోటే మియా అనే మూవీలో కూడా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ సరసన నటించింది. కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా పడింది.
గత ఏడాది థియేటర్లలో గ్రాండ్ రిలీజైన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్కు వర్కర్గా, లవర్గా, మంచి వైఫ్గా నటించి.. ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన అందంతో యువతను ఫిదా చేసిందనడంలో అతిశక్తిలేదు. ఒక్క సినిమాతోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాందించుకుందంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. ఈ విషయాలు పక్కన పెడితే.. ఈ బ్యూటీ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈమె మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడువీర్ పహారియాతో డేటింగ్లో ఉందట. ఇటీవల హీరో వీర్ పహారియాతో మానుషీ ఉన్న ఓ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అందులో ఈ బ్యూటీ వీర్ పహారియా భుజంపై తలపెట్టి ఉంది. ఈ వీడియోలో జాన్వీ అండ్ ఆమె లవర్ శిఖర్ పహారియా కనిపించడం గమనార్హం. వీర్, శిఖర్ స్వంత అన్నదమ్ములట. దీంతో వీర్-మానుషీ కొన్నాళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు, ప్రస్తుతం డేటింగ్లో ఉన్నారంటూ నెట్టింట టాక్ వినిపిస్తోంది.