షాకింగ్ వీడియో షేర్ చేసిన రష్మి.. దారుణంగా కొట్టి చంపుతోన్న వీడియో వైరల్

by Disha Web Desk 9 |
షాకింగ్ వీడియో షేర్ చేసిన రష్మి.. దారుణంగా కొట్టి చంపుతోన్న వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కొందరు మూగ జీవుల పట్ల ఎంతో ప్రేమను కనబరుస్తారు. తమ ఇంటి వ్యక్తిలా భావించి ప్రేమానురాగాలు పంచుతారు. ఒకవేళ అవి దూరమైతే వారి బాధను తట్టుకోలేక రోజుల తరబడి ఏడుస్తుంటారు. అలాంటి పక్షులు, జంతువుల పట్ల కొంతమంది క్రూరంగా ప్రవర్తిస్తారు. తాజాగా ఓ వ్యక్తి ఆవును దారుణంగా చితకబాదుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి యాంకర్ రష్మి గౌతమ్ స్పందించారు. ‘‘ఆవు మనకు తల్లి కంటే ఎక్కువ. జీవితంలో మన తల్లి మూడేళ్లు మాత్రమే తన రొమ్ముతో పాలిస్తుంది. కానీ ఆవు జీవితాంతం మనకు పాలను అందిస్తుంది. స్వరం లేని జీవిని ఇంత హింసించడం చాలా బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యులపై హింస చూపించడానికి వెనుకాడరు. అతడు తల్లిని గౌరవించడని ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది’’. అంటూ రష్మి ఫైర్ అవుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు స్పందించి.. ఆ క్రూరుడిపై దుమ్మెత్తిపోస్తున్నారు.

Next Story

Most Viewed