- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
టీవీ యాంకర్ పై దారుణం.. తీర్థంలో నిద్ర మాత్రలు ఇచ్చి ఆ పని చేసిన పూజారి!
దిశ, సినిమా : ఓ టీవీ యాంకర్ పై జరిగిన ఘటన ప్రస్తుతం అందరిని షాక్కు గురి చేస్తోంది. తీర్థంలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఏకంగా యాంకర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పూజారి. అసలు విషయంలోకి వెళ్లితే.. చెన్నైలోని సాలిగ్రామం ప్రాంతంలో టీవీ యాంకర్ నివసిస్తూ ఉంటుంది. అయితే ఆమెకు ఎప్పుడూ ఆలయాలకు వెళ్లే అలవాటు ఉండటంతో, ప్రతి రోజూ చెన్నైలోని పర్యాస్ ప్రాంతంలోని కాళికంపాల్ ఆలయానికి వెళ్తుండేది.
ప్రతి రోజూ ఆలయానికి వెళ్లడంతో అక్కడి పూజారి తో పరిచయం ఏర్పడింది. దీంతో ఆమెకు స్పెషల్గా పూజలు జరిపించేవారు. అయితే ఒకరోజు యాంకర్ను పూజారి కావాలనే, నేను నా కారు లో డ్రాప్ చేస్తానంటూ చెప్పి, తీర్థంలో నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేశాడంట. దీంతో ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరగా, తాను కూడా ఒకే చెప్పి ఎప్పుడూ తన ఇంటికి వెళ్లే వాడు. ఈ క్రమంలోనే ఆమెకు ప్రెగ్నెంట్ అవుతే అబార్షన్ చేయించాడని, తనను బలవంతంగా వ్యభిచారం లోకి దిగమని ఫోర్స్ చేస్తున్నట్లు యాంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ షాక్కు గురిచేస్తుంది. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేయడం ప్రారంభించారు.