తెలంగాణలో ఓడించి.. ఇప్పుడు ఏపీకి పోయింది.. యాంకర్ లాస్యపై ట్రోల్స్

by Indraja |   ( Updated:2024-04-08 18:19:32.0  )
తెలంగాణలో ఓడించి.. ఇప్పుడు ఏపీకి పోయింది.. యాంకర్ లాస్యపై ట్రోల్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తన చిలిపి తనంతో.. స్మైల్‌తో బుల్లితెర ప్రేక్షకులందర్ని కట్టిపడేసింది. ముఖ్యంగా యాంకర్ రవి-లాస్య జోడి జనాలందరిని ఆకట్టుకుంది. అనూహ్యంగా ఈ బ్యూటీ బుల్లితెరకు దూరమై.. మంజూనాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇదంతా పక్కన పెడితే.. లాస్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గులాబీల జెండాలమ్మ పాటకు డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో రీల్స్ చేసిన యాంకర్ లాస్య.. ఇప్పుడు ఏపీలో ఎన్నికల వేళ జగన్ పాటలకు డ్యాన్సులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించి ఇప్పుడు ఏపీలో జగన్‌ను ఓడించడానికి వెళ్లిందంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్రోల్స్‌పై లాస్య ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

Advertisement

Next Story