Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు అరుదైన అవార్డు

by Hamsa |
Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు అరుదైన అవార్డు
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. అయితే ఈ సినిమాను యదు వంశీ తెరకెక్కించగా.. ఇందులో 11 మంది హీరోలు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్ రాధ్యా, నలుగురు హీరోయిన్లు నటించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీని ఆగస్టు 9న వంశీ నందిపాటి థియేటర్స్‌లో విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో పల్లెటూరి వాతావరణం, స్నేహం, ప్రేమ, కుటుంబంలోని ఎమోషన్స్ అన్ని చూపించడంతో ‘కమిటీ కుర్రోళ్ళు’ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అంతేకాకుండా కలెక్షన్స్ పరంగా కూడా లాభాలను తెచ్చిపెట్టింది. అలాగే పలువురు సినీ ప్రముఖులు మెప్పు పొందింది. అయితే ఇటీవల కమిటీ కుర్రోళ్ళు 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రజెంట్ ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, కమిటీ కుర్రోళ్ళు ఓ అరుదైన అవార్డు అందుకోబోతుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఎంఎస్‌కే ట్రస్ట్-ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీ అసోసియేషన్‌తో కలిసి అందించే మాస్టర్ పీస్ ఆఫ్ తెలుగు సినిమా-2024 అవార్డుకు ఎంపికైంది. ఈ విషయాన్ని నిహారిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతూ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed