- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
‘ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా హార్మోన్లలో మార్పులు జరిగాయి’ బాపు బొమ్మ ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: ‘బావ’ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ ప్రణీత సుభాష్. తర్వాత జూనియర్ ఎన్టీఆర్(రభస), పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (అత్తారింటికి దారేది) సరసన నటించి.. బాపు బొమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. కెరీర్లో ఎదిగే సమయంలోనే ఈ బ్యూటీ వ్యాపారవేత్తైన నితిన్ రాజును వివాహమాడింది. ఈ దంపతులిద్దరికి 2022 లో ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం ప్రణీత అమ్మగా రెండోసారి ప్రమోషన్ పొందడానికి సిద్ధంగా ఉంది. రీసెంట్గానే ఈ గుడ్న్యూస్ను అభిమానులతో పంచుకుంది.
బేబీ బంప్ ఫొటో సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘రౌండ్ 2 ఇక నుంచి ప్యాంట్లు సరిపోవు’ అంటూ రాసుకొచ్చింది. తాజాగా ఈ అమ్మడు నెట్టింట ప్రెగ్నెన్సీ సమయంలో మానస్థిక పరిస్థితి గురించి మరో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘నిద్రలేని రాత్రులు, హార్మోన్లలో మార్పులు, పెల్విక్ పెయిన్, యాసిడ్ రిఫ్లక్స్, సి- సెక్షన్ కోసం రెడీ అవున్నాను. ఈ సమయంలో అత్యంత విలువైన వాళ్లు నా పక్కన ఉన్నారు’. అంటూ నటి ప్రణీత సుభాష్ తన భర్త నితిన్ రాజుతో ఉన్న ఓ పిక్ను జోడించి సోషల్ మీడియాలో వెల్లడించింది.