- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
సినిమాలో ఫన్కి ఢోకా ఉండదు.. ‘శ్వాగ్’పై డైరెక్టర్ కామంట్స్
దిశ, సినిమా: యంగ్ హీరో శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'శ్వాగ్'. ఇందులో రీతూ వర్మ హీరోయిన్గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ‘శ్వాగ్’ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉండటంతో.. తాజాగా మీడియాతో ముచ్చటించిన డైరెక్టర్ హసిత్ గోలి సినిమా విశేషాలని పంచుకున్నారు.
‘సందేశం కోసం తీసిన సినిమా కాదు ఇది. మగ-ఆడ గొడవ ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉండేది వంశం. ఈ రెండిటిని లింక్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్గా కనిపించింది. మాతృస్వామ్య వ్యవస్థ అనేది అక్కడక్కడ కనిపిస్తుంది. దాన్ని ఎక్స్ఫ్లోర్ చేయడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సందేశం కాదు గాని.. తరతరాలుగా మగ ఆడ గొడవ అనేది ఎలా మారుతూ వచ్చింది. ఇప్పటికి దాని రిలవెన్స్ ఏంటి అనే ఆలోచనతో చేసిన కథ. స్టోరీ మాత్రం చాలా బాగుంటుంది. విష్ణు నుంచి కోరుకునే ఫన్ ఉంటుంది. ఆ ఫన్ కూడా కథలో చాలా ఆర్గానిక్గా కుదిరింది. ఇందులో ఫన్, కథకి ఢోకా ఉండదు. ఇంటర్వెల్ బ్లాకు ఆశ్చర్యపోయేలా ఉంటుంది. మొత్తంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది’ అంటూ చెప్పుకొచ్చాడు.
Read More...