పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవని ముగ్గురు ఆత్మహత్య

by Sumithra |
పెళ్లి ఖర్చులకు డబ్బులు లేవని ముగ్గురు ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌లో విషాదం నెలకొంది. పెళ్లి ఖర్చులకు డబ్బులు సమకూర్చలేదన్న మనస్తాపంతో తల్లీ, ఇద్దరు కూతుళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. గాంధీచౌక్‌లో గోపాలపురం ప్రకాశ్‌, గోవిందమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కూతుర్లు రాధిక, రమ్య ఉన్నారు. ప్రకాశ్‌ మహబూబాబాద్‌లో బంగారం మెరుగుపెట్టే పనిచేస్తున్నాడు. అయితే ప్రకాశ్‌ పెద్ద కూతురు రాధికకు ఇటీవలే పెళ్లి సంబంధం కుదిరింది. జనవరి 11న వారి వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి పెళ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన తల్లీ, ఇద్దరు కూతుళ్లు బుధవారం రాత్రి తమ ఇంట్లో ఉన్న బంగారం మెరుగుపరిచేందుకు ఉపయోగించే రసాయనాన్ని తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పనికి వెళ్లి తిరిగి వచ్చిన ప్రకాశ్ తలుపు ఎంత కొట్టిన తెరవకపోవడంతో పొరుగువారిని పిలిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story