ఉడుము కోసం వెళితే… ఉన్న ప్రాణాలు పాయే..!

by Sumithra |   ( Updated:2021-06-15 08:44:53.0  )
accident 01
X

దిశ, డోర్నకల్: ఉడుముల వేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే .. డోర్నకల్ మండలం వెన్నారం గ్రామనికి చెందిన జక్కుల వెంకన్న ( 45 ) అనే వ్యక్తి మంగళవారం ఉడుములు వేటకు వెళ్ళాడు. ఈ క్రమంలో ఓ చోట రాళ్ళ మధ్యన ఇరుక్కున్నాడు ఒక్కసారిగా పైన ఉన్న పెద్ద బండరాయి మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed