హత్య చేసి.. ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టి

by srinivas |

పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటన దేవరపల్లి మండలం దద్దుకూరులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మల్లిపూడి వెంకటేష్ అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతుడు వైన్ షాపు వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags: man, murder, west godavari, petrol, crime news, ap

Next Story

Most Viewed