అర్థరాత్రి భార్యను అది అడిగిన భర్త.. కుదరదనేసరికి నిద్రిస్తున్న ఆమెను..

by Sumithra |
అర్థరాత్రి భార్యను అది అడిగిన భర్త.. కుదరదనేసరికి నిద్రిస్తున్న ఆమెను..
X

దిశ, మక్తల్: మహబూబ్ నగర్ లో దారుణం జరిగింది. తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్యను అతికిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడో భర్త. అంతేకాకుండా భార్యను హతమార్చి పోలీసులు వచ్చేవరకు మృతదేహం వద్దనే కూర్చున్నాడు. ఈ ఘటన మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆదివారం మధ్య రాత్రి జరిగింది. గ్రామస్తులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చందాపూర్ గ్రామంలో రాములు అనే వ్యక్తి భార్య సత్యమ్మతో కలిసి నివాసముంటున్నాడు.

రాములు మద్యానికి బానిసై, పనికి వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండేవాడు. తనకు మద్యానికి డబ్బులు ఇవ్వాలని రోజు భార్యను హింసిస్తుండేవాడు. ఈ విషయమై రోజు భార్యాభర్తలు గొడవపడుతుండేవారు. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రాంతాల్లో నిర్మాణ పనుల్లో కూలీలుగా చేస్తున్నరాములు కొడుకులు జీతం డబ్బును తల్లికి ఇచ్చి వెళ్లిపోయారు. ఆదివారం కొడుకులు డబ్బులు ఇచ్చారని తెలుసుకున్న రాములు ఆ డబ్బు తనకు ఇవ్వాలని అర్ధరాత్రి భార్యతో గొడవకు దిగాడు. సత్యమ్మ డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పి నిద్రపోయింది. దీంతో కోపోద్రేకుడైన రాములు మద్యం మత్తులో ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకొని నిద్రిస్తున్న భార్య గొంతుపై నరికాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సత్యమ్మ అక్కడిక్కడే మృతిచెందింది. సోమవారం ఉదయం స్థానికులు ఆ ఘటనను చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, నిందితుడు రాములును అరెస్ట్ చేశారు.

దేవుడు ఆజ్ఞాపించాడు.. పాస్టర్ తాళికట్టాడు

Advertisement

Next Story