- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
మణిపూర్లో మరో దారుణం.. ఇద్దరు విద్యార్థుల హత్య
గువాహటి: మణిపూర్ రాజధాని ఇంఫాల్లో వందలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఇద్దరు మైనర్ విద్యార్థులను సాయుధులైన అనుమానాస్పద వ్యక్తులు దారుణంగా హత్య చేయడాన్ని నిరసిస్తూ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విద్యార్థులు ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ నివాసంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో భద్రతా బలగాలతో ఘర్షణ జరిగింది. ఈ మేరకు గుంపును చెదరగొట్టడానికి బలగాలు.. టియర్ గ్యాస్ షెల్స్, పొగ బాంబులను ఉపయోగించాయి. దీంతో 30 మందికిపైగా విద్యార్థులు గాయపడగా, వారిని వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో దాదాపు ఐదు నెలల నిషేధం తర్వాత మొబైల్ ఇంటర్నెట్ పునరుద్ధరించారు. ఈ క్రమంలోనే అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాల చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిరసన చెలరేగింది. కాగా రాష్ట్రంలో జాతి హింస ఉధృతంగా ఉన్న సమయంలోనే(జులై 6న) ఆ ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారు.