రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మృతి

by Sridhar Babu |
రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నాయకుడు మృతి
X

దిశ, తాడ్వాయి : తాడ్వాయి మండలం మేడారం కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఉపాధ్యక్షులు ఆలకుంట రమేష్ (45) ములుగు జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో స్థానికులు వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడికక్కడే మృతి చెందారు. స్వగ్రామంలో బుధవారం అంత్యక్రియలలో పాల్గొని మృతదేహానికి పూలమాలవేసి కాంగ్రెస్ నేతలు నివాళలు అర్పించారు. అనంతరం కుటుంబానికి మంత్రి సీతక్క అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో

తాడ్వాయి మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్, సహర సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, గౌరవ మండల అధ్యక్షులు జాలపు రెడ్డి, మాజీ ఎంపీటీసీ బత్తిని రాజు గౌడ్, ఎప్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న, సీనియర్ నాయకులు జంగా వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ సర్పంచ్ మంకిడి నరసింహస్వామి, చర్ప నేతాజీ, సింగిల్ విండో డైరెక్టర్లు యానాల సిద్దిరెడ్డి, బీసీ సెల్ మండల అధ్యక్షులు యాసాడపు మల్లయ్య, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షులు పురుషోత్తం నారాయణ, గండికోట కృష్ణస్వామి, శేఖర్, సాగర్, భూషబోయిన రవికుమార్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జల రాజశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Next Story