పండగపూట తీవ్ర విషాదం.. 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్

by Rajesh |   ( Updated:2024-04-11 05:17:49.0  )
పండగపూట తీవ్ర విషాదం.. 15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పండగ పూట కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో విషాదం చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా రథం లాగుతుండగా విద్యుత్ షాక్ కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న చిన్నారులను నేతలు పరామర్శించారు. అయితే చిన్నారుల్లో పలువురి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed