- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బెహరాన్ లో వేంపేటవాసి మృతి
by Sridhar Babu |
X
దిశ, మెట్ పల్లి : బతుకుదెరువు కోసం రెండున్నర సంవత్సరాల క్రితం బెహరాన్ దేశానికి వెళ్లిన వ్యక్తి బుధవారం రాత్రి అక్కడే మరణించాడు. వేంపేట గ్రామానికి చెందిన మారంపల్లి సుధీర్ (35) అనే వ్యక్తి గత రెండున్నర సంవత్సరాల క్రితం బెహరన్ లో ఓ కంపెనీలో పనిలో కుదిరాడు. అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న సుధీర్ అక్కడికి వెళ్లినా సమస్య తీరకపోవడంతో తన గదిలో ఉరివేసుకొని చనిపోయినట్లు గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లూరి మహేందర్ రెడ్డి తెలిపారు. మృతునికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా మృతదేహాన్ని వీలైనంత తొందరగా తీసుకొచ్చేలా, కుటుంబాన్ని ఆదుకునేలా చూస్తామని మహేందర్ రెడ్డి తెలిపారు.
Advertisement
- Tags
- Beharan
Next Story