తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..

by Sumithra |
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ..
X

దిశ, ఘట్కేసర్ : దసరా పండుగకి ఊరికి వెళ్లొచ్చేసరికి తాళం వేసిన ఇంట్లో దొంగలు పడి బంగారం, నగదు దోచుకెళ్లిన సంఘటన రాచకొండ కమిషనరేట్, ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో నివాసం ఉంటున్న లకావత్ సంపత్ ఘట్కేసర్ విద్యుత్ సబ్స్టేషన్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.

ఈ నెల 12న (దసరా పండుగ రోజు) తన స్వగ్రామం జనగాం జిల్లా, రఘునాథపల్లి, మండలం గూడెంకు కుటుంబ సభ్యులతో వెళ్ళాడు. బుధవారం ఉదయం ఘట్కేసర్ ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులకు వేసిన తాళం విరగొట్టి ఉన్న దృశ్యం చూసి అవాక్కయ్యాడు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని దుస్తులు చెల్లాచెదురుగా పారేసి ఉన్నాయి. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, రూ.30 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బాధితుడు సంపత్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed