- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
యూపీ గ్యాంగ్ స్టర్ హత్య కేసులో సంచలన విషయాలు..
by Vinod kumar |
X
దిశ, డైనమిక్ బ్యూరో: యూపీలో సంచలనం సృష్టించిన గ్యాంగ్ స్టర్ సంజీవ్ జీవా హత్య కేసులో పోలీసుల విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిజానికి తాను హత్య చేయబోయే వ్యక్తి ఎవరో తెలియకుండానే నిందితుడు విజయ్ యాదవ్ దారణంగా జీవాను హతమార్చినట్లు పోలీసులు తేల్చారు.
మొత్తం రూ. 20 లక్షలకు నిందితుడు విజయ్ డీల్ కుదుర్చుకున్నాడని అడ్వాన్స్గా రూ.5 వేలు మాత్రమే తీసుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు విచారణలో పోలీసులు తేల్చారు. కాగా, ఈ నెల 7వ తేదీన ఓ కేసు విచారణ నిమిత్తం లక్నో కోర్టు వచ్చిన గ్యాంగ్ స్టర్ జీవాను అందరూ చూస్తుండగానే విజయ్ తుపాకితో కాల్చి చంపేశాడు. ఈ కాల్పుల్లో ఓ పోలీస్తో పాటు బాలిక గాయపడింది.
Advertisement
Next Story