కేరళలో దారి దోపిడీ.. వ్యాపారిని కట్టేసి రూ.50 లక్షలు కొట్టేసిన రాబర్స్

by karthikeya |   ( Updated:2024-10-22 04:24:04.0  )
కేరళలో దారి దోపిడీ.. వ్యాపారిని కట్టేసి రూ.50 లక్షలు కొట్టేసిన రాబర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళలో దారిదోపిడీకి పాల్పడ్డారు కొందరు దుండగులు. కారులో వెళ్తున్న వ్యాపారిపై దాడి చేసిన దుండగులు.. కార్లోనే వ్యాపారిని కట్టేసి అతడి దగ్గర ఉన్న రూ.50 లక్షలు లాక్కుని పారిపోయారు. ఇది గమనించిన స్థానికులు, వ్యాపారిని కాపాడారు. కానీ అప్పటికే దొంగలు పారిపోవడంతో సదరు వ్యాపారి స్థానిక పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశాడు.

ఇదిలా ఉంటే కేరళలో దారి దోపిడీ జరగడం ఇది తొలిసారి కాదు. ఈ మధ్య కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. గత నెలలో కూడా నేషనల్ హైవేపై ఇలాంటి ఘటనే జరిగింది. ముఖ్యంగా నేషనల్ హైవే 544ని అడ్డాగా చేసుకుని కార్లపై దొంగలు దాడులకు తెగబడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed