ప్రోఫెషనల్ దొంగలు.. ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీ..

by Aamani |   ( Updated:2024-10-23 14:20:57.0  )
ప్రోఫెషనల్ దొంగలు.. ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీ..
X

దిశ, బషీరాబాద్ : ఒక్క రాత్రే మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన సంఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని పర్శ నాయక్ తండా లో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మూడు ఇండ్లలోకి దూరి పలు విలువైన వస్తువులు,నగదు, బంగారం దోచుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీసులు పర్శ నాయక్ తండా చేరుకొని బాధితుల ఇండ్లు పరిశీలించారు.బషీరాబాద్ ఎస్ఐ గఫార్ ద్వారా విషయం తెలుసుకున్న తాండూర్ డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి, గ్రామీణ సీఐ శ్రీనివాస్ రెడ్డి కలిసి ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పండు ఇంట్లో నాలుగు తులాల బంగారం,16 తులాల వెండి పట్టీలు,రూ.20వేల నగదు కాగా, పక్కింట్లో నిద్రిస్తున్నా రాహుల్ అనే యువకుడి నుంచి సెల్ ఫోన్ దొంగిలించారు. చవాన్ గోపాల్ ఇంట్లో రూ. 40 వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా డీఎస్పీ , గ్రామీణ సీఐ మాట్లాడుతూ దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలో గుర్తించి పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed