రోడ్డు ప్రమాదంలో పేపర్ బాయ్ మృతి..

by Aamani |
రోడ్డు ప్రమాదంలో పేపర్ బాయ్ మృతి..
X

దిశ ,చింతకాని: చింతకాని మండల నరసింహ పురం గ్రామం హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద చింతకాని-వెంకటాయపాలెం రోడ్డు లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు నాలుగు గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని రఘునాథపాలెం మండలానికి చెందిన రాజుల అనిల్ 32 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుల అనిల్ ప్రతిరోజు చింతకాని ఆటోలో న్యూస్ పేపర్ ని వేసి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed