వాహన తనిఖీల్లో రూ. 50 లక్షలు సీజ్

by Sridhar Babu |
వాహన తనిఖీల్లో రూ. 50 లక్షలు సీజ్
X

దిశ, కార్వాన్ : వాహన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బును సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాసాచారి కథనం ప్రకారం... బొగ్గులకుంట తిలక్ రోడ్డు సభ కేఫ్ వద్ద సుల్తాన్ బజార్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అమిత్ సిర్వాని (42) అనే బట్టల వ్యాపారి అబిడ్స్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా పోలీసులు ఆపి తనిఖీలు చేపట్టారు. దాంతో రూ.50 లక్షల హవాలా నగదు లభ్యమైంది. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed