- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
హనుమంతుడే పంపాడేమో.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయబోయిన కామాంధుడు.. కాపాడిన కోతులు
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం కాలంలో అమ్మాయిలకు రక్షణ లేదని దేశంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే తెలుస్తోంది. అసలు ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు ఎప్పుడు ఏం జరుగుతుందో అని నిత్యం బిక్కుబిక్కుమంటున్నారు. నెలలు నిండని చిన్నారి నుంచి పండు ముసలి వరకు అందరిపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇక అత్యాచారం జరుగుతున్న సమయంలో ఎవరైనా వచ్చి కాపాడుతారేమో అని బాధితులు కాపాడండి.. కాపాడండి అంటూ అరుస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సిట్యూవేషన్స్లో దగ్గర పాటు వారు ఎవరైన వీరి అరుపులు విని నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు పట్టించిన సంఘటనలు చాలానే చూశాం. కానీ ఈ ఘటనలో మాత్రం మనుషులకు బదులుగా స్వయంగా హనుమంతుడే వానర సైన్యాన్ని పంపించి ఈ చిన్నారిని రక్షించినట్లు అనిపించింది. వివరాల్లోకి వెళితే..
ఉత్తర ప్రదేశ్లోని బాఘ్పట్లో ఓ కోతుల గుంపు ఆరెళ్ల బాలికను అత్యాచారం నుంచి కాపాడాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని దుండగుడు ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తులు తొలగించాడు. ఇక అత్యాచారం చేయబోతుండగా కోతుల గుంపు వచ్చి ఆ కామాంధుడిని తరిమి వేసింది. దీంతో అతడు ఆ బాలికను అక్కడే విడిచి పెట్టి వెళ్లిపోయాడు. కాగా ఈ ఈ ఘటనను పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.