అర్హులమైనా రుణమాఫీ జరగలేదు.. రైతుల ఆవేదన..

by Sumithra |
అర్హులమైనా రుణమాఫీ జరగలేదు.. రైతుల ఆవేదన..
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అర్హులమైనా రుణమాఫీ జరగలేదని ఆరోపిస్తూ సిద్దిపేట రూరల్ మండలం వెంకటాపూర్ గ్రామ రైతులు సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి ప్రజావాణిలో అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ ప్రక్రియలో గ్రామంలోని కొంత మంది రైతులకు మాత్రమే రుణ మాఫీ జరిగిందన్నారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్నా కొంతమందికి రుణమాఫీ జరగలేదన్నారు. రుణమాఫీ కాని రైతులందరికీ మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్ర బాలవ్వ, మణమ్మ, తిరుపతి, దుర్గయ్య, ప్రభాకర్, లింగయ్య, రైతులు పాల్గొన్నారు. అదే విధంగా సిద్దిపేట పట్టణంలోని కోనో కార్పస్ చెట్లను తొలగించాలని కోరుతూ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో అర్జీ అందజేశారు.

Next Story

Most Viewed