Sharad Pawar: మేం ఒకే కుటుంబంలా కలిసే ఉన్నాం.. అజిత్ పవర్ పై శరద్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
Sharad Pawar: మేం ఒకే కుటుంబంలా కలిసే ఉన్నాం.. అజిత్ పవర్ పై శరద్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అజిత్ పవార్, తాను ఒకే కుటుంబంలా కలిసి ఉన్నామని ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. శరద్- అజిత్ పవార్ ద్వయం మరోసారి కలసి పోటీ చేయాలని వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ పైస్పందించారు. "ఘరత్ తరీ ఎకత్రాచ్ అహెత్ (మేము ఇంట్లో కలిసే ఉన్నాము)" అని అని చెప్పుకొచ్చారు. ఇకపోతే, గతేడాది జూలైలో శరద్ పవార్ నుంచి విడిపోయిన అజిత్ పవార్ ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఎదిగారు. లోక్ సభ ఎన్నికల్లో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పైన తన భార్య సునేత్ర పవార్ ను పోటీకి దింపడం తప్పుడు నిర్ణయం అని చెప్పుకొచ్చారు.

తిరుమల లడ్డూ వివాదంపై..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకే ప్రజలు సానుకూలంగా ఉన్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన స్పందించారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వుతో కూడిన నాసిరకం నెయ్యిని వాడటం చాలా తప్పు అని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed