- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
Ravneet Bittu : రాహుల్గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. కేంద్ర మంత్రి బిట్టుపై ‘పిల్’ ఉపసంహరణ
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : ఇటీవలేే అమెరికా పర్యటన సందర్భంగా సిక్కులపై రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు వివాదాస్పద విమర్శలు చేశారు. ‘‘దేశానికి అతిపెద్ద శత్రువు రాహుల్ గాంధీ’’ అని ఈనెల 15న మీడియా సమావేశంలో ఆయన కామెంట్ చేశారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ హిందూసేన చీఫ్ సుర్జిత్ సింగ్ యాదవ్ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు.
బాధ్యతారహితంగా మాట్లాడినందుకు కేంద్ర మంత్రిని విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే తాజాగా సోమవారం రోజు తన పిటిషన్ను సుర్జిత్ సింగ్ యాదవ్ ఉపసంహరించుకున్నారు. రవ్నీత్ సింగ్ బిట్టుపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు వేర్వేరుగా కేసులు వేసినందున ఇక పిల్ను కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి తాను వచ్చానని ఆయన తెలిపారు.
Next Story