గురుకుల హాస్టల్ లో విద్యార్థి అదృశ్యం..

by Sumithra |
గురుకుల హాస్టల్ లో విద్యార్థి అదృశ్యం..
X

దిశ, ఇబ్రహీంపట్నం : గురుకుల హాస్టల్ లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకెళితే యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం మల్లేశ్ కుమారుడు గడ్డం నితిన్ (14) హాస్టల్లో ఉండి విద్యనభ్యసిస్తున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. రోజంతా వెతికినా నితిన్ ఆచూకీ తెలియరాలేదు. ఆందోళనలలో విద్యార్థి కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు అతని కోసం గాలిస్తున్నారు. ఇటు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు కాగా ఐదు పోలీస్ బృందాలు విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed