Vijayawada: 4వ అంతస్థు కిటికీలో నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి

by karthikeya |   ( Updated:2024-10-28 08:23:47.0  )
Vijayawada: 4వ అంతస్థు కిటికీలో నుంచి పడి 4 ఏళ్ల చిన్నారి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: అప్పటివరకు ఆడుతూ పాడుతూ అన్నతో దొంగా పోలీస్ ఆడుకుంటున్న చిన్నారి క్షణాళ్లో విగతజీవిగా మారింది. క్షణం క్రితం తమ కళ్ల ముందు నవ్వుతూ ఉన్న తమ కుమార్తె మరణంతో చిన్నారి తల్లిండ్రులు గుండెలు పగిలేలా రోదించసాగారు. ఈ ఘటన విజయవాడలోని మాచవరంలో చోటుచేసుకుంది. స్థానిక హోటల్‌లో ఆడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారి అనుకోకుండా 4వ అంతస్థు కిటికీలో నుంచి జారి పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ నాగరాజు కుటుంబం శ్రీశైలం వెళ్తోంది. నాగరాజుకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. దారి మధ్యలో విజయవాడలోని మాచవరంలో ఉన్న ఓ హోటల్‌లో బస చేసేందుకు దిగింది. అయితే రాత్రి సమయంలో అన్న, చెళ్లెల్లు ఇద్దరూ దొంగ పోలీస్ ఆట ఆడుకుంటుండగానే.. దాక్కునేందుకు 4 ఏళ్ల చిన్నారి కిటికి తలుపు తెరుస్తూ.. ఆ ప్రయత్నంలోనే ప్రమాదవశాత్తు కిటికీ నుంచి జారి కింద పడిపోయింది. సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్న మాచవరం పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed