నిజామాబాద్ మేయర్‌కు కరోనా.. వీఆర్ఏ మృతి

by vinod kumar |
నిజామాబాద్ మేయర్‌కు కరోనా.. వీఆర్ఏ మృతి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్:
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతు కిరణ్‌కు కరోనా వైరస్ సోకినట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ సుదర్శనం తెలిపారు. శుక్రవారం వచ్చిన 38 పాజిటివ్ కేసులలో నగర మేయర్‌కు పాజిటివ్ రాగా, బోదన్ రెవెన్యూ గెస్ట్ హౌజ్‌లో పనిచేసే వీఆర్ఏ వైరస్‌తో చికిత్స పొందుతూ జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో చనిపోయారు. నిజామాబాద్ జిల్లాలో ఓ సీఐతో పాటు ఒక హోంగార్డుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. 24 రోజుల్లో 501 పాజిటివ్ కేసులు రాగా 200 పైగా నిజామాబాద్ నగరంలోనే నమోదు కాగా, జిల్లాలో మొత్తం వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 643 కాగా, కామారెడ్డి జిల్లాలో శుక్రవారం 62 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం జిల్లాలో కేసుల సంఖ్య 583కు చేరాయి.

Advertisement

Next Story