కోఠి డీపీహెచ్ ఉద్యోగికి కరోనా

by vinod kumar |
కోఠి డీపీహెచ్ ఉద్యోగికి కరోనా
X

దిశ, హైదరాబాద్: కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) కార్యాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. అక్కడి భవనంలోని రెండో అంతస్థులో పనిచేసే ఓ ఉద్యోగి కరోనా బారిన పడ్డారు. ఎపిడిమిక్స్ విభాగంలో కీటక నివారణ అధికారిగా పని చేస్తున్న ఆయనకు జ్వరం రావడంతో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో అక్కడ పనిచేసే ఇతర ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story