ఎమ్మెల్యే బాజిరెడ్డి సతీమణికి కరోనా పాజిటివ్

by vinod kumar |
ఎమ్మెల్యే బాజిరెడ్డి సతీమణికి కరోనా పాజిటివ్
X

దిశ, నిజామాబాద్: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన సతీమణికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు నిర్ధారించారు. ఇటీవల ఎమ్మెల్యే బాజిరెడ్డి ఇంటి పనిమనిషికి పాజిటివ్ వచ్చింది. దీంతో బాజిరెడ్డి సతీమణిలో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్ర శేఖర్ ధ్రువీకరించారు.

Advertisement

Next Story